telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ఈరోజు 739 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్‌ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,333 పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Health Department Releases Covid 19 Cases Bulletin In Ap - Sakshi

దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య 2,69,82,681కు చేరగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,22,064కు పెరిగింది. ఇప్పటివరకు 19,93,589 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,925కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,550 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రోజున హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Related posts