*చంద్రబాబును కలిసిన ద్రౌపతిముర్ము
*సామాజిక న్యాయం కోసం ద్రౌపతిముర్ముకు టీడీపీ మద్దతు
*ద్రౌపతి ముర్ము ఒడిశాలో పేదకుటుంబంలో పుట్టిన ఆదివాసి
*ద్రౌపతి ముర్ము ఒడిశాలో పుట్టడం మన అదృష్టం..
ఎన్డిఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటనకు విచ్చేసారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు.
గేట్ వే హోటల్ కు వచ్చిన ముర్మును చంద్రబాబు కలిసి వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ..ఆదివాసీలు, పేదల కోసం ద్రౌపది ముర్ము పనిచేశారని ఆయన అన్నారు. చాలా పేదరికంలో పుట్టి..కష్టపడి చదువుకుని ఈరోజు రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యారని చంద్రబాబు అన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు అభినందించారు.
తెలుగుదేశం పార్టీ తొలి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చంద్రబాబు తెలిపారు. గిరిజన మహిళకు అత్యున్నత పదవి దక్కడం ఆనందించదగ్గ విషయమని అన్నారు.
తమ పార్టీ తరుపున ద్రౌపది ముర్ముకు అభినందనలను తెలుపుతున్నామని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు.
డీజీపీ ఠాకూర్ కాన్వాయ్ లో రూ.35 కోట్లు.. సీఎం తరపున పంచటానికే .. : విజయసాయి