ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఆయన కమ్యూనికేషన్ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులిచ్చారు.
సీఎం వైఎస్ జగన్ రేపు ఉదయం 8.49 గంటలకు తొలిసారిగా సచివాలయంలోని సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్నారు. దీంతో ముఖ్యమంత్రి చాంబర్ మొదటి బ్లాక్ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. రేపు జరగనున్న మంత్రుల పదవీ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు.
ప్రత్యేకహోదాను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు:నారాయణ