telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఆవుల మృతి పై ఘాటుగా స్పందించిన తెలంగాణ ఎమ్మెల్యే

BJP-MLA Raja-Singh

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు ఆనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆవుల కళేబరాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన వెటర్నరీ వైద్యులు.. విషప్రభావం కారణంగానే మూగజీవాలు మృత్యువాత పడ్డాయని తేల్చారు. దీంతో ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉందని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు.

పెద్ద సంఖ్యలో ఆవులు ఒకేసారి చనిపోయాయంటే అక్కడ కుట్ర కోణం ఉందన్నారు. మాకున్న సమాచారం ప్రకారం స్థానికంగా గోశాల స్థలంపై గొడవ ఉందని, ఇక్కడి భూమి ఖరీదుగా మారిపోవడంతో కొన్ని దుష్టశక్తుల కన్ను ఆ గోశాలపై పడిందన్నారు. ఆ గోశాలలో కూడా రెండు గ్రూపులు ఉన్నాయని తెలిసింది. ఈరోజు లేదా రేపు మేం గోశాలను సందర్శిస్తామని రాజాసింగ్ పేర్కొన్నారు.

 

Related posts