యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నేడు అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్నిఆవిష్కరించనున్నారు. అయోధ్యలోని శోధ్ సంస్ధాన్ మ్యూజియంలో రోజ్వుడ్తో ఈ విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక నుంచి రూ 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు.
రాముడి ఐదు అవతారాల్లో ఒకటైన కోదండరాముని అవతారంలో ఈ విగ్రహం రూపొందింది.
మ్యూజియంలో రాముడి గురించిన పలు చారిత్రక ఘట్టాలతో 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. కోదండరామ విగ్రహాన్ని కర్ణాటక స్టేట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎంపోరియం నుంచి కొనుగోలు చేశారు.