telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీసీల రిజర్వేషన్లను కోత పెట్టడం దారుణం: చంద్రబాబు

chandrababu

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని జిల్లాల్లో బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత పెట్టడం దారుణమన్నారు. జడ్పీటీసీ స్థానాల్లో నెల్లూరులో 13%, ప్రకాశంలో 19.64%, పశ్చిమ గోదావరిలో 18.75%, కృష్ణా 20.41%, తూర్పుగోదావరి 20.97%, విశాఖలో 20.51% కు బీసీలను పరిమితం చేశారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇవ్వడమే కాకుండా.. బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత ఎన్టీఆర్ దేననని చంద్రబాబు తెలిపారు.

Related posts