రాష్ట్రంలో వైసీపీ వర్గీయుల అరాచకాలు పేట్రేగాయని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలతో ఆ పార్టీ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 రోజుల్లో 6గురు టీడీపీ కార్యకర్తల హత్య కిరాతకమన్నారు. అధికారం అండతో అరాచక శక్తులు పేట్రేగుతున్నాయని అన్నారు.
కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామాలు ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పొలాలు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారన్నారు. అంగన్ వాడీ భవనాలను కూలగొట్టారని, రోడ్లు తవ్వేస్తున్నారన్నారని ఆరోపించారు. ఇన్ని దాడులను రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు.