telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..30 మందికి గాయాలు

Accident

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గత రాత్రి భువనగిరి చౌరస్తా వద్ద కారును ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానికులు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి తాత్కాలిక డ్రైవర్ అతివేగమే కారణమని తెలుస్తోంది. డ్రైవర్ కారును గమనించకుండా వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts