లాక్డౌన్ నేపథ్యంలో ప్రేమికులు నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి, ఓ చెట్ట కింద కుర్చొని ముచ్చట్లు మొదలుపెట్టారు. కానీ, వాళ్ల బ్యాడ్ లక్ డ్రోన్ రూపంలో వెంటాడింది. వాళ్లు ఆదమరిచి ఉన్న సమయంలో సైలెంట్గా వారి కళ్ల ముందు డ్రోన్ ప్రత్యక్షమైంది. ఆ డ్రోన్ను చూడగానే వెంటనే తమ ముఖాలకు ముసుగులు వేసుకుని. బైకు ఎక్కి పారిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది. లాక్డౌన్ ఉల్లంఘించేవారిపై నిఘా ఉంచేందుకు పోలీసులు ఇప్పుడు డ్రోన్లు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు పోలీసులు భారీ సంఖ్యలో డ్రోన్లను వినియోగిస్తు్న్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
previous post