నగరంలో రహదారుల విస్తరణలో భవనాలను కోల్పోతున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈసమావేశంలో ముషీరాబాద్ చౌరస్తానుంచి వైస్ర్తాయ్ వరకూ చేపట్టిన రహదారిని 100 అడుగుల విస్తరణకు సేకరించనున్న స్థలాలు, భవనాల యజమానులు , జీహెచ్ఎంసి టౌన్ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సుమారు 3కోట్ల రూపాయలు ఖర్చుతో ఈ రహదారి విస్తరణతో పాటు వర్షపునీటి సమస్య పరిష్కారానికి నూతన డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్టు తెలిపారు.
కుంతియా అనే ఐరన్లెగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం: సర్వే