telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

రోడ్డు రోలర్ తో మద్యం సీసాల ధ్వంసం

liquor broken

ఏపీలో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల పట్టుకున్న అక్రమ మందు సీసాలను ఈ రోజు ధ్వంసం చేశారు.

కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో తొక్కించారు. మచిలీపట్నంలో సుమారు 14 వేల అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై క్రమపద్ధతిలో పేర్చి రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.72 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

Related posts