అడవి శేష్, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోహీరోయిన్లుగా వెంకట్రెడ్డి దర్శకత్వంలో `2స్టేట్స్` సినిమాను నిర్మాత ఎంఎల్వీ సత్యనారాయణ ప్రారంభించారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన “2స్టేట్స్” నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయిపోయింది. చివరి షెడ్యూల్ ఒక్కటే బాకీ ఉంది. దీన్ని అమెరికాలో ప్లాన్ చేసారు. ఇలాంటి తరుణంలో నిర్మాత, దర్శకుడి మధ్య విభేదాల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇదే విషయాన్ని ఇప్పుడు హీరో అడవి శేష్ కన్ఫర్మ్ చేసాడు. తాజాగా ఓ న్యూస్ పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2 స్టేట్స్ రీమేక్ ఆగిపోయిందని చెప్పాడు. క్షణం, గూఢచారి లాంటి సినిమాల తర్వాత శేష్ ఈ సినిమా ఒప్పుకున్నాడు. కానీ ఎవరు సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో 2 స్టేట్స్ రీమేక్పై అంచనాలు పెరిగాయి. పైగా రాజశేఖర్ కూతురు తొలి సినిమా కావడం కూడా ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిందని అడవి శేష్ చెప్పడంతో 2 స్టేట్స్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది.
బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ మిస్టేక్ ఇదేనా?