telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

70 లక్షల విరాళం అందించనున్న రామ్‌చరణ్

ramcharan

పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో తాను రూ. 70 లక్షల విరాళం అందించనున్నట్టు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు కలిగి ఉన్న రామ్‌చరణ్ తాజాగా ట్విటర్‌లోకి కూడా ప్రవేశించాడు. ఈ రోజు గురువారం ట్విటర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. కరోనాపై పోరాటానికి విరాళాన్ని అందిస్తున్నట్టు తొలి ట్వీట్ చేశాడు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ చేస్తున్న కృషిని ప్రశంసించాడు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని సూచించాడు.

Related posts