telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ లో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్…?

ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ లో రెండు డోసులు వేయాలి. మొద‌టి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల‌కు సెకండ్ డోస్ తీసుకోవాలి. రెండు డోసుల విధానం వ‌ల‌న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఆల‌స్యంగా సాగుతున్న‌ది. దీంతో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌పంచంలో క‌రోనాకు తొలి వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను రెడీ చేసింది. ఇప్ప‌టికే ర‌ష్యాలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా, వివిధ దేశాల్లో దీనికి అనుమ‌తులు మంజూరు చేశారు. కాగా, ఇండియాలో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమ‌తుల కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకుంది. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేసే అవ‌కాశం ఉంది. వ్యాక్సిన్‌కు అనుమ‌తులు వ‌స్తే ఇండియాల సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది. చూడాలి మరి ఎప్పుడు అనుమతి వస్తుంది అనేది.

Related posts