టాలీవుడ్ లో అగ్రహీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శ్రియ ఇప్పుడు హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు శ్రియ మళ్ళీ తెలుగు, తమిళ చిత్రాల్లో వచ్చిన అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన శ్రియా ఇప్పుడు టాలీవుడ్లో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి ఒప్పుకుందట. “ఐతే”, “సాహసం”, “మనమంతా” వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇప్పటి వరకు “గౌతమిపుత్ర శాతకర్ణి”, “గోపాలగోపాల” చిత్రాల్లో శ్రియా శరన్ తల్లి పాత్రల్లో నటించింది. ఇప్పుడు మరోసారి తల్లి పాత్రలో శ్రియా నటించనుంది. 10 ఏళ్ల అమ్మాయికి తల్లిగా శ్రియను చూపించున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
previous post
next post