బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నభా నటేష్ హీరోహీరోయిన్స్గా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభమైంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ “డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, ఇతర విదేశాల్లో చిత్రీకరణ జరపబోతున్నాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ “దర్శకుడు సంతోష్ కందిరీగ సినిమా నుండి పరిచయం. తనతో వర్క్ చేయడం నా కుటుంబ సభ్యులతో చేసినట్టుగా ఉంది. మంచి పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను. నభా నటేష్ కూడా పెర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది. అల్లుడు శీను, జయజానకి నాయక తర్వాత దేవిశ్రీ ప్రసాద్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది” అన్నారు.
#BSS8 launched in style
Starring @BSaiSreenivas under the direction of #SantoshSrinivas
Clap 🎬 by #VVVinayak
Camera 📽 switched on by #GeminiKiran
First shot directed by #Dilraju@NabhaNatesh @ThisIsDSP @dudlyraj #AvinashKolla #SumanthMovieProductions pic.twitter.com/kzMhPZbLt6— BARaju (@baraju_SuperHit) 29 November 2019
మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం