telugu navyamedia
సినిమా వార్తలు

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ లో అల్లు అరవింద్ మాట్లడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయి, వాటిని త్వరగా పరిష్కరించాలి. కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో సినీ పరిశ్రమను రక్షించాలి. రాజు తలుచుకుంటే వరాలకు కొదువ సినీ పరిశ్రమ సమస్యలను దయ చేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మీపై ఆధార పడి వుంటాయి. సినీ పరిశ్రమ విజయ వంతంగా కొనసాగేందుకు సహకరించాలి అని అన్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్.. లవ్‌, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక పూజా హెగ్డే, అఖిల్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక ట్రైలర్ మధ్యలో జాతిరత్నాలు ఫ్రేమ్ ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్రయూనిట్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా వుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 15న థియేటర్లోకి రానుంది.

Related posts