telugu navyamedia
క్రీడలు వార్తలు

కొత్త కెప్టెన్ వేటలో ఢిల్లీ.. ఎందుకంటే…?

భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌‌ ఫీల్డింగ్‌ చేసే సమయంలో గాయపడ్డారు. అయితే అయ్యర్‌కు అయిన భుజం గాయం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. గాయం కారణంగా ఐపీఎల్ 2021 అతడు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం తీవ్రత దృష్ట్యా భుజానికి సర్జరీ చేయాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కానీ ఏప్రిల్‌ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును నడిపించే ఆటగాడి కోసం ప్రాంఛైజీ ఇప్పటికే చర్చలు మొదలెట్టింది. కెప్టెన్సీ కోసం ఐదుగురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. స్టీవ్‌ స్మిత్‌, పృథ్వీ షా, రిషబ్ పంత్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానేలు పోటీలో ఉన్నారు. గత సీజన్‌లో పరుగుల వరద పారించిన ఢిల్లీ సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే ధావన్‌కు జట్టును ముందుండి నడిపించే సత్తా ఉన్నా.. గతంలో ఎప్పుడూ సారథ్యం చేసిన దాఖలు లేవు. కాబట్టి ధావన్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు.

Related posts