టాలీవుడ్లో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న మిల్కీబాయ్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’తెరకెక్కుతుంది. మహేష్ బాబుకు జతగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ అభిమానును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను 2022 జనవరి 13న రిలీజ్కానుంది. దీంతో “సర్కారు వారి పాట ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొత్తానికి సంక్రాంతికి మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” తో పేక్షకులకు విందు బోజనం పెట్టనున్నారు. ఇక గత నాలుగైదు రోజులను నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయమై ఏ వార్త వచ్చినా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో “సర్కారు వారి పాట” టీజర్ కు సంబంధించిన ఫైనల్ స్టేజ్కు వచ్చినట్లు తెలుస్తుంది.
కాగా ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకున్న “సర్కారు వారి పాట ” మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభించగానే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. జూలై నెలలో “సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది.
రనుమండల్ పై లతా మంగేష్కర్ వ్యాఖ్యలు… హిమేష్ రేష్మియా మద్ధతు