సినీ ప్రముఖులు జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుతోపాటు, జమ్మూకశ్మీర్ విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో..సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలియజేశారు. న్యూయార్క్లో నిద్రలేచే సరికి నా జీవితంలో గొప్ప శుభవార్త విన్నా. నా ఆటోబయోగ్రఫీ విడుదలైన రోజు ఈ నిర్ణయం వెలువడటం అద్భుతమైన బహుమతి. భారత్కు శుభాకాంక్షలు అని ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది.
భారత్ను ఉగ్రవాదరహిత దేశంగా మార్చడంలో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ధైర్యసాహసాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కేవలం మోదీకే సాధ్యం. ఈ శుభసందర్భంలో జమ్మూకశ్మీర్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక నుంచి జమ్మూకశ్మీర్ వాసులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్లు నటి కంగనారనౌత్ ట్వీట్ చేసింది. లడఖ్, జమ్మూకశ్మీర్ ప్రజల శాంతి, శ్రేయస్సు, సుస్థిరమైన అభివృద్ధికి తీసుకున్న నిర్ణయం. ఆ ప్రాంతాల ప్రజలకు గుడ్ లక్ అంటూ నటి దియా మీర్జా ట్వీట్ చేసింది. ట్విట్టర్ లో జాతీయ జెండా చిత్రాలను పోస్ట్ చేసి జమ్మూకశ్మీర్ ప్రజలకు తన విషెస్ నందించారు బాలీవుడ్ నటి రవీనాటాండన్.
ఈసారి మోదీ హవా ఉండదు: ఒవైసీ