బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ప్రస్తుతం కీలకపాత్రల్లో నటించడమే కాకుండా విలన్ గా కూడా నటిస్తూ పలు కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కన్నడ చిత్రం కేజీఎఫ్లో విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పానిపట్ అనే చారిత్రాత్మక చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలగులోను బాలయ్య సినిమాలో విలన్గా నటిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా సంజయ్ దత్ రీసెంట్గా తన స్నేహితులు రుషి కపూర్, నీతూ కపూర్ను కలిసేందుకు ముంబైలోని వాళ్లింటికి వెళ్లాడు. అక్కడ వారితో సరదా క్షణాలని గడిపిన సంజయ్ పలు ఫోటోలకి ఫోజులిచ్చాడు. అయితే నీతూ కపూర్ తాజాగా షేర్ చేసిన ఫోటోలో సంజయ్ దత్ చాలా నీరసంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్స్, ఆయన అభిమానులు సంజయ్ దత్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా ? అంటూ ఆందోళన చెందుతున్నారు. నెటిజన్లు మాత్రం సంజయ్ తాగినట్లుగా కన్పిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
previous post