“పిట్టా కథలు” వెబ్ సిరిస్ను నాగ్ అశ్విన్, బి. వి. నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ మరియు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ నాలుగు లఘు చిత్ర విభాగాలతో కూడిన 2021 భారతీయ తెలుగు భాషా సంకలన నాటక చిత్రం. ఈ చిత్రంలో అమలా పాల్, అశ్విన్ కాకుమాను, ఈషా రెబ్బా, జగపతి బాబు, లక్ష్మి మంచు, ఆషిమా నార్వాల్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే మరియు శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని RSVP మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. అయితే.. ఈ సిరీస్ శుక్రవారం నెట్ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సిరీస్పై సమంత, రకుల్ ప్రశంసలు కురిపించారు. పిట్టకథలు అందరూ చూడాల్సిన సిరీస్ అని పేర్కొన్నారు. ఈ సిరీస్లో మీరా అనే భాగాన్ని డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డిపై సమంత ప్రశంసలు కురిపించింది. అలాగే అందులో నటించిన అమలాపాల్, జగపతి బాబును కూడా అభినందించింది.
next post