తాజాగా శ్రీ విష్ణు హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. దీనిని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఓటిటిలో విడుదల అయి పర్వాలేదు అనిపించుకున్న ‘జోహార్’ చిత్రంతో మన ముందుకు వచ్చిన డైరెక్టర్ తేజ మర్ని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించారు. “బ్రోచే వారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టి ప్రారంభించారు. శ్రీ విష్ణుకి జోడిగా అమృత కథానాయికగా నటిస్తుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో మొదలుకానుంది. శ్రీ విష్ణు ‘గాలి సంపత్’ చిత్రం కూడా ఇటీవలే ప్రారంభమైంది. ‘పటాస్’ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాలకు కో డైరెక్టర్, రైటర్గా వర్క్ చేసిన మిత్రుడు ఎస్. కృష్ణ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సమర్పిస్తూ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.
previous post
next post