telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన జనాలు…

Accident

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఒక్కసారిగా తగ్గిన పోయిన విషయం తెలిసిందే. అయితే..లాక్ డౌన్ సడలించడంతో మళ్ళీ విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా..కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏకంగా ఆర్టీసీ డ్రైవర్ బుక్ అయ్యాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ ను జనాలు చితకబాదారు. వివరాల్లోకి వెళితే..కామారెడ్డి లోని రోడ్ లో టీవీఎస్ ఎక్సెల్ ను కరీంనగర్ డిపో 1 కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో..ఎక్సెల్ పై ప్రయాణిస్తున్న పసుల పోశయ్య (63)కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ మల్లయ్య నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అంటూ డ్రైవర్ ను తీవ్రంగా స్థానికులు చితకబాదారు.  డ్రైవర్ సీట్లో నుంచి కిందకు లాక్కొచ్చి మరీ కొట్టారు క్షతగాత్రుని బంధువులు స్థానికులు. స్థానికులు కొట్టడంతో ఆర్టీసీ డ్రైవర్ కు సైతం గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో తన తప్పు ఏమీ లేదంటున్న ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా..ఈ ప్రమాదంలో గాయపడిన ఆర్టీసీ డ్రైవర్, పసుల పోశయ్య స్థానిక హాస్పిటల్ పంపించారు. 

Related posts