తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను బలహీనపర్చేందుకు రాష్ట్ర నాయకత్వం పకడ్బందీగా వ్యవహరించిందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఈ విషయాలను ఐఎసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా కూడ సీరియస్గా పట్టించుకోలేదన్నారు. బీజేపీలో చేరిన డీకే అరుణ బుధవారం న్యూఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం అసమర్ధత కారణంగానే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దెబ్బతింటుందని ఆరోపించారు.
పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిని కేంద్రీకరించలేదన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే కాంగ్రెస్ పార్టీని ఒక్క స్థానంలో కూడ గెలవకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానిదేనని ఆమె ఆరోపించారు.
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్