తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డికి యాజమాన్యం మరోసారి సెలవును నిరాకరించింది. ఎంజీబీఎస్లో కంట్రోలర్గా ఉన్న ఇ.అశ్వత్థామరెడ్డి సమ్మెను విరమించిన తర్వాత తనకు 6 నెలల పాటు సెలవు ఇవ్వాలంటూ ఎంజీబీఎస్ ఏటీఎంకు దరఖాస్తు చేసుకున్నారు.
కానీ సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెలవు ఇవ్వడం కుదరదంటూ అప్పట్లో నిరాకరించారు. ఈసారి తనకు 6 నెలల పాటు వేతనం లేకుండా సెలవు ఇవ్వాలని అశ్వత్థామరెడ్డి మారోసారి దరఖాస్తు చేసుకున్నారు. దీనిని కూడా నిరాకరిస్తున్నట్లు శనివారం ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.