రాజకీయం, సినిమా ఇలా రెండు రంగాల్లో తమదైన ముద్ర వేసిన అతి కొద్ది మంది మహిళల్లో రోజా ఒకరు. నటిగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు రోజా. అప్పట్లో కుర్రకారు పడిచచ్చిపోయిన గ్లామర్ గర్ల్ రోజా. డాన్స్, పర్ఫార్మెన్స్, గ్లామర్ ఇలా అన్నింటిలో రోజా టాప్ లో ఉండేది.
రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో రోజా కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలా కొన్నేళ్లు టాప్ ప్లేస్లో ఉన్న రోజా దర్శకులు ఆర్.కె.సెల్వమణి పెళ్ళి చేసుకున్నారు.
ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా బుల్లితెరలోను జబర్దస్త్ షోకి జర్జ్గా వ్యవహారిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుడిగాలి సుదీర్ హోస్టింగ్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాంకి గెస్టుగా హాజరై అందర్నీ ఏడిపించేసింది రోజా. రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉన్నా.. బుల్లితెరలలో మాత్రం మొహం నిండా నవ్వుతో ఎప్పుడు చలాకీగా ఉండటం రోజా స్టైల్. అలాంటి రోజా తన కెరీర్ బిగినింగ్ లో పడ్డ కష్టాలు.. తన తీవ్ర ఆరోగ్య సమస్యలు గురించి చెప్తూ ఏమోషినల్ అయ్యింది.
వినాయకచవితి సందర్భంగా ఊరిలో వినాయకుడు అనే స్పెషల్ ఈవెంట్ లో ఈ సంఘటన చోటుచేసుకోగా ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఓ ఈవెంట్లో రోజా ఎమోషనల్..
‘నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను.. 2002 వరకు కష్టపడిన మొత్తం కూడా అప్పులే కట్టాను. పెళ్లి చేసుకునే ముందు నాకు సమస్యలు వచ్చాయి.. అప్పుడే నాకు పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ దేవుడి దయతో పెళ్లైన ఏడాదికి అన్షు పుట్టింది. అందుకే నాకు అన్షు అంటే చాలా ఇష్టం అంటూ రోజా కన్నీరు పెట్టేసుకున్నారు. దీంతో షోలో పాల్గొన్న వారి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఇది చూసిన నెటిజన్లు.. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే రోజా జీవితంలోనూ ఇంతటి కష్టాలు ఉన్నాయని అనుకుంటున్నారు.