telugu navyamedia
క్రీడలు వార్తలు

వార్నర్ ను ట్రోల్ చేసిన రోహిత్ శర్మ…

ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు చేరుకున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్​ డేవిడ్ వార్నర్​. ఇక ఐపీఎల్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏ ఆటగాడైన బయో బబుల్‌లోకి వెళ్లే ముందు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఈ క్రమంలోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన డేవిడ్ భాయ్.. ఈ సమయాన్ని గడపడానికి ఏవైనా ఐడియాలు ఉంటే సూచించాలని ఇన్‌స్టా వేదికగా అభిమానులను కోరాడు. “హాయ్‌ ఫ్యాన్స్‌.. చెన్నైకి చేరుకున్నాను. కానీ, ఒక సమస్య ఉంది. రానున్న వారం రోజులు క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. కాలక్షేపం కోసం ఏమి చేయాలో సూచించండి. దయచేసి కామెంట్ చేయండి. అవసరమైతే కొన్ని మంచి సినిమాల గురించి సజెస్ట్‌ చేయండి” అని ఇన్​స్టా వేదికగా వార్నర్ అభిమానులను కోరాడు. అయితే ఈ వీడియో పోస్ట్‌కు టీమిండియా డాషింగ్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘వార్నర్.. నువ్వు కచ్చితంగా టిక్ టాక్‌ను మిస్సవుతున్నట్లున్నావ్’అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక గతేడాది లాక్‌‌డౌన్ సందర్భంగా వార్నర్.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని అలరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీ, తెలుగు సినిమా పాటలకు సతీమణి క్యాండిస్ వార్నర్‌తో కలిసి చిందేసి భారత్ అభిమానులు అలరించాడు.

Related posts