ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు అమెరికా తాము వ్యాక్సిన్ కనుగొన్నాము అని తెలిపింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా టీకా తీసుకున్నారు. డెలావర్లోని క్రిస్టియానా ఆసుపత్రిలో 78 ఏళ్ల బైడెన్ ఫైజర్ వ్యాక్సీన్ మొదటి డోసు ఇచ్చారు. బైడెన్కు వ్యాక్సినేషన్ను అమెరికా టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. వ్యాక్సీన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల్లో అపోహను తొలగించడానికే తాను టీకా వేసుకుంటున్నట్టు తెలిపారు బైడెన్. టీకా వేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారాయన. టీకా తీసుకుంటున్న సందర్భంలో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె అంతకు ముందురోజే వ్యాక్సీన్ తీసుకున్నారు. ఫైజర్ వ్యాక్సిన్కు అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) అనుమతి లభించిన నేపథ్యంలో టీకా కార్యక్రమం మొదలైంది. గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు అమెరికాలో సుమారు మూడు లక్షల 20 వేల మంది చనిపోయారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉండడంతో మాస్క్లు ధరించాలని తెలిపారు.
previous post
next post