హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. అయితే ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 లో గాయపడిన రోహిత్ ను మొదట ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ ఆ తర్వాత ఐపీఎల్ చివరి మ్యాచ్ లలో ఆడి తాను ఫిట్ గా ఉన్నాను అని హిట్ మ్యాన్ నిరూపించుకోవడంతో అతడిని కేవలం టెస్ట్ జట్టుకు ఎంపిక చేసారు. కానీ అంతకంటే ముందు అతను తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాలని బీసీసీఐ తెలిపింది. అందువల్ల యూఏఈ నుండి నేరుగా ఆస్ట్రేలియా కు వెళ్లకుండా రోహిత్ భారత్ కు తిరిగి వచ్చాడు. ఇక తాజాగా రోహిత్ ఎన్సిఎ చీఫ్ రాహుల్ ద్రవిడ్ ఎదుట అవసరమైన పరీక్షలను క్లియర్ చేసాడు. దాంతో అతను ఆసీస్ బయలు దేరనున్నాడు . కానీ రోహిత్ అక్కడికి వెళ్లిన తర్వాత 14 రోజులు నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. కానీ మొదటి రెండు మ్యాచ్ లకు రోహిత్ దూరం కానున్నాడు. అలాగే జనవరి 7 నుండి సిడ్నీలో ప్రారంభమయ్యే మూడవ టెస్టులో అతను పాల్గొంటాడు. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ పూర్తికాగానే భారత కెప్టెన్ రోహిత్ వెనక్కి తిరిగి రానున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ సిరీస్ లో రోహిత్ రాణిస్తాడా… లేదా అనేది.
previous post