ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పైచేయి బౌలర్లదే. ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఓ బౌలర్.. నాలుగు లేదా అంతకుమించి వికెట్లను తీసుకునే సంప్రదాయం ఈ సీజన్ బిగినింగ్ నుంచీ కొనసాగుతోంది. అమిత్ మిశ్రా దాన్ని మరంత ముందుకు తీసుకెళ్లాడు. ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మకు వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ నష్టాన్ని మిగిల్చింది. ప్రత్యర్థికి మ్యాచ్ను ధారదాత్తం చేసుకోవడమే కాకుండా.. జరిమానాను ఎదుర్కొనాల్సి వచ్చింది. అతనిపై 12 లక్షల రూపాయల జరిమానాను విధించారు నిర్వాహకులు. స్లోయర్ ఓవర్ రేట్ కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇది రెండో జరిమానా. ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెత్తిన 12 లక్షల రూపాయల ఫైన్ పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ఎంఎస్ ధోనీ ఫైన్ కట్టాడు.
previous post
next post