telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆనందయ్యను కిడ్నాప్ కాకుండా కాపాడండి : వర్మ

Ramgopal varma

ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది.  అయితే ఈ మందుపై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురించి వర్మ తనదైన శైలిలో స్పందించాడు. “ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణ పట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డా. ఫౌసీ వస్తున్నారని విన్నాను.. ఆనందయ్యతో కరోనా రేసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికై ఉండవచ్చు. ఏ నేపథ్యంలో ఆనందయ్యను కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి..మిలటరీ భద్రత కల్పించాలి. అంతే కాదు ఉచితంగా ఆనందయ్య మందు ఇవ్వడం గొప్ప నిర్ణయం. అతనికి నోబెల్ బహుమతి ఇవ్వాలి” అని వర్మ ట్వీట్ చేశారు. 

Related posts