telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఒకే కుటుంబానికి రెండు ప్రమాదాలు ..

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు పరిధిలో దారుణం జ‌రిగింది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి ద్విచక్రవాహనంపై ఇద్దరు పిల్లలతో కలిసి వెళుతున్నఓ కుటుంబంలో విషాదం నెల‌కొవంది మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకొనే లోపే అనుకోని దారుణం చోటు చేసుకుంది..

వివ‌ర్లాలోకి వెళితే..

గుమ్మడిదలకు చెందిన కమ్మరి బ్రహ్మచారి(32), ఆయన భార్య కల్పన(25), కుమార్తె కృతిక శివాని(4), కుమారుడు కార్తీక్‌(2)లు.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ శివారులోని బొల్లారంలో ఓ శుభకార్యానికి బయలుదేరారు. దోమడుగులో వీరి వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలు కావడంతో తేరుకుని సమీపంలోని అన్నారం ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు.

అనంతరం శుభకార్యానికి వెళ్లకుండా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ దోమడుగు పరిధికి రాగానే ఓ మలుపు వద్ద ద్విచక్ర వాహనం రెండోసారి అదుపు తప్పి విభాగినిని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న నలుగురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మధ్యలో కల్పన, కృతికశివాని మృతి చెందారు. బ్రహ్మచారి, కుమారుడు కార్తీక్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో సూరారంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related posts