telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

డైమండ్ నెక్లెస్ లంచం..ఏసీబీకీ చిక్కిన మహిళా డ్రగ్ ఇన్ స్పెక్టర్

ARREST crime

బ్లడ్ బ్యాంక్ అనుమతి కోసం లంచంగా డైమండ్ నెక్లెస్ కోరిన మహిళా డ్రగ్ ఇన్ స్పెక్టర్ బండారం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. నగరంలో బ్లడ్ బ్యాంక్ అనుమతి కోసం లంచం కింద లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ తనకు ఇవ్వాలని కోరిన డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి ఓ జ్యుయలరీ షాపులో లక్ష్మీతో కలిసి బ్లడ్ బ్యాంక్ యజమాని షాపింగ్ చేశారు.

షాపింగ్ కు సంబంధించిన దృశ్యాలను స్పై కెమెరాతో చిత్రీకరించారు. ఆ నెక్లెస్ ను ఇవ్వడానికి లక్ష్మి నివాసానికి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెళ్లారు. ఈ నెక్లెస్ ను ఆమె తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా, షాపింగ్ నకు సంబంధించిన దృశ్యాల సీడీ ఏసీబీ అధికారుల వద్ద ఉంది. గతంలో కూడా ఇదే బ్లడ్ బ్యాంక్ నుంచి రూ.50 వేలు ఆమె లంచంగా తీసుకున్నట్టు సమాచారం.

Related posts