బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం సీబీఐ, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ రియాను విచారిస్తోంది. అయితే తాజాగా నాకు, నా కుటుంబానికి ముప్పు ఉంది అంటూ సోషల్ మీడియాలో రియా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ మేరకు రియా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని మీడియా వారు చుట్టుముట్టారు. దానికి.. “ఇది నా బిల్డింగ్ కాంపౌండ్ లోపల… సీబీఐ, ఈడీ, వివిధ దర్యాప్తు అధికారులతో సహకరించడానికి మేము మా ఇంటి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాము. ఆ సమయంలో నాకు, నా కుటుంబానికి ముప్పు ఉంది. మేము స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం కూడా ఇచ్చాము. అయినా ఎలాంటి సహాయం అందించలేదు. దర్యాప్తుకు రావడానికి మాకు సహాయం చేయాలంటూ దర్యాప్తు అధికారులకు కూడా సమాచారం ఇచ్చాము. వారు కూడా ఎటువంటి సహాయం చేయలేదు. మరి మా కుటుంబం ఎలా జీవించాలి? దర్యాప్తు సంస్థలతో మేము సహకరించడానికి దయచేసి రక్షణ కల్పించాలని నేను ముంబైపోలిస్లను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు” అని రియా తెలిపింది.
బిగ్బాస్ షో..ఓ బూతు ప్రోగ్రాం..