telugu navyamedia
సినిమా వార్తలు

పరుగుల రాణి పీటీ ఉష బయోపిక్ లో కత్రినా ?

Katrina-Kaif

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగులో “మల్లీశ్వరి” సినిమాతో అభిమానులను అలరించింది. 15 ఏళ్ల నుంచి పలు చిత్రాల్లో నటిస్తూ ఇంకా టాప్ హీరోయిన్ గానే నటిస్తున్నారు. తాజాగా కత్రీనా “పరుగుల రాణి” పీటీ ఉష బయోపిక్ లో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని సమాచారం. అయితే ఈ విషయమై కత్రీనా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమాకు ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాత్రకోసం గతంలో హీరోయిన్ ప్రియాంకను సంప్రదించారని సమాచారం. అయితే ఆమె తన హాలీవుడ్ ప్రాజెక్టు కారణంగా ఈ సినిమాను నిరాకరించారని అంటున్నారు. ఇక కత్రీనా, సల్మాన్‌తో పాటు నటించిన “భారత్” సినిమా జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది.

Related posts