యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం”చావు కబురు చల్లగా”. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా “చావు కబురు చల్లగా” టీజర్ ను ఇటీవల విడుదల చేసారు. ఈ సినిమాలో శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నాడు. ‘చావు కబురు చల్లగా’లో ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. యాంకరింగ్తో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తున్న అనసూయ ఈ సినిమాలో కనిపించనుంది. ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్లో నటించనుండగా.. ఇందుకు సంబంధించి ఫోటోలు రిలీజ్ అయ్యాయి. కాగా…. రంగస్థలం సినిమాతో అనసూయ ఏ రేంజ్ కు వెళ్లిందో తెలిసిందే..