telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కరోనా బారిన పడిన ఎన్టీఆర్…

NTR

కరోనా సెకండ్ వేవ్ రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ప్రభువం చూపుతుంది. అయితే ఇప్పటికే చాలా మంది రాజకీయనాయకులు, సినీ నటులు, క్రీడాకారులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని  స్వయంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా  నిర్ధారణ అయ్యింది. ప్లీజ్ డోంట్ వర్రీ… నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం, నేను వేరువేరుగా ఐసోలేషన్ లో ఉన్నాము. మేము వైద్యుల పర్యవేక్షణలో అన్ని ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

Related posts