telugu navyamedia
క్రీడలు వార్తలు

వారం రోజుల్లోనే 11 కోట్ల విరాళాలు సేకరించిన విరుష్క జంట…

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ విరాట్‌ కోహ్లీ, అనుష్కశర్మ దంపతులు కెట్టో సంస్థతో కలిసి ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ పేరిట కొవిడ్‌-19 రిలీఫ్‌ కోసం ఫండ్ రైజింగ్ క్యాంపైన్ చేపట్టిన విషయం తెలిసిందే. ముందుగా విరుష్క దంపతులు తమ వంతుగా రూ.2 కోట్ల విరాళం అందించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అయితే కోహ్లీ, అనుష్క ప్రారంభించిన ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ ఫండ్‌ రైజింగ్‌ క్యాంపైన్‌కు విశేషమైన స్పందన లంభించింది. వారం రోజుల్లోనే రూ.11 కోట్ల విరాళాలు వచ్చాయి. దాంతో ఈ క్యాంపైన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తాము నిర్దేశించుకున్న రూ.11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రకటించారు. ‘మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా ఆశ్చర్యపోయాను. మేం తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా ఎక్కువ మొత్తం సేకరించడం గర్వంగా ఉంది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఇదిలాగే కొనసాగుతుంది. దేశ ప్రజలకు సహాయం చేయడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు. మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జై హింద్’ అని అనుష్క, కోహ్లీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటివరకు రూ.11,39,11,820 విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు.

Related posts