వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం “ఎంటర్ ది గర్ల్ డ్రాగన్”. బ్రూస్ లీ అభిమాని అయిన ఓ మహిళ కథగా ఈ సినిమా రూపొందుతోంది. ఇండో చైనీస్ మూవీగా రానున్న ఈ చిత్రంలో పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ ట్రైలర్ను శుక్రవారం బ్రూస్ లీ పుట్టిన ప్రాంతం చైనాలోని పోషాన్లో విడుదల చేశారు. “ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూడటానికి సైకిల్పై వెళ్లాను. కానీ నేడు బ్రూస్ లీ పాదాల చెంత `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` ట్రైలర్ను విడుదల చేయడానికి విమానంలో వచ్చాను“ అంటూ వర్మ మెసేజ్ను పోస్ట్ చేశారు. ఇండియాలో తొలి మార్షల్ ఆర్ట్ మూవీ ఇదేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
next post