బీజేపీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులు మరోసారి హౌస్ అరెస్టు చేశారు.శుక్రవారం వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆయన నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు రేవంత్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.. తన అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాగా.. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని గత సోమవారం (డిసెంబర్ 27) కూడా రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి చేపట్టారు. కానీ ఒమిక్రాన్ వ్యాప్తి, కోవిడ్ నిబంధనలు ఉన్నందున రేవంత్రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
తాజాగా వరంగల్ శాయంపేటలో రచ్చబండకు బయలుదేరిన రేవంత్ని హైదరాబాద్లో మరోసారి రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది
మంత్రులంతా భజనపరులు..భట్టి తీవ్ర విమర్శలు!