అడివి శేష్, రెజీనా కసండ్ర జంటగా నటించిన “ఎవరు” చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. “ఎవరు” చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల మన్ననలను పొందింది రెజీనా కసండ్ర. సినిమా ప్రారంభంలో ఆమె పాత్రకు, ముగింపు సమయంలో పాత్రకు చాలా వేరియేషన్ ఉంటుంది. రెజీనా పోషించిన సమీర పాత్రను దర్శకుడు వెంకట్ రామ్జీ పలు ట్విస్టులతో ఆసక్తికరంగా మలిచారు. ఈ సినిమాలో క్లైమాక్స్ను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారని అందరూ ప్రశంసిస్తున్నారు. మరి కొంత మంది తమ మొబైల్స్తో క్లైమాక్స్ విజువల్స్ను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ విషయంపై “ఎవరు” సక్సెస్మీట్లో రెజీనా మాట్లాడుతూ “సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తోన్న రెస్పాన్స్ సూపర్బ్. నేను సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్లినప్పుడు సీట్ ఎడ్జ్ మూవీలో ప్రేక్షకులు ఎలా ఉంటారా? అని దగ్గర నుండి చూశాను. అలాగే సినిమాలోని ట్విస్టులకు ఎగ్జయిట్ అయిన కొంతమంది ప్రేక్షకులు క్లైమాక్స్ విజువల్స్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సినిమాలోని ట్విస్ట్ను రివీల్ చేస్తున్నారు. ప్లీజ్ అలా చేయకండి.. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా కీలకం. ఆ సీక్రెట్ను సినిమా చూసిన ప్రేక్షకులు బయట పెట్టకండి” అని రిక్వెస్ట్ చేశారు.
previous post