telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020: కేకేఆర్ పై బెంగుళూర్ భారీ విజయం…

సీజన్ లో మంచి ఊపుమీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమిష్టిగా రాణించి కోల్‌కత నైట్ రైడర్స్ పై 82 పరుగులతో భారీ విజయం సాధించింది.  టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ…. ఆ జట్టు ఓపెనర్లు దేవదత్ పాడికల్(32), ఆరోన్ ఫించ్ (47) అనుకున్న విధంగానే జట్టుకు మంచి ఆరంభాన్నీ ఇచ్చారు. ఇక వారు ఇరువురు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ, డివిలియర్స్ క్రీజులు కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో డివిలియర్స్ చెలరేగిపోయాడు.

కేవలం 33 బంతుల్లో 6 సిక్స్ లు, 5 ఫోర్లతో 73 పరుగులు చేసాడు. దాంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బౌలర్ లలో ఆండ్రీ రస్సెల్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే కోల్‌కత 195 పరుగులు చేయాలి. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కత విఫలమవడంతో 112 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బెంగళూరు విజయం అనివార్యం అయింది.

Related posts