telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : చెలరేగిన డివిలియర్స్… కేకేఆర్ ముందు భారీ లక్ష్యం…

ఈరోజు షార్జా వేదికగా ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఆ జట్టు ఓపెనర్లు దేవదత్ పాడికల్(32), ఆరోన్ ఫించ్ (47) అనుకున్న విధంగానే జట్టుకు మంచి ఆరంభాని ఇచ్చారు. ఇక వారు ఇరువురు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ, డివిలియర్స్ క్రీజులు కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో డివిలియర్స్ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 6 సిక్స్ లు, 5 ఫోర్లతో 73 పరుగులు చేసాడు. దాంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇక కేకేఆర్ బౌలర్ లలో ఆండ్రీ రస్సెల్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే కోల్‌కత 195 పరుగులు చేయాలి. అయితే బెంగళూరు బౌలింగ్ గురించి అందరికి తెలిసిందే. కొన్ని సార్లు ఎంత లక్ష్యాన్ని ప్రత్యర్థులకు ఇచ్చిన తమ పేలవ బౌలింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంది, మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తారు.. ఎవరి విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts