మధ్యప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఊపందుకోంతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 64 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానం ఉప ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 27 ఖాళీ స్థానాలకుగాను తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా:
జౌరా నుంచి పంకజ్ ఉపాధ్యాయ
సుమవాలి నుంచి అజాబ్ కుశ్వాహ
గ్వాలియర్ ఈస్ట్ నుంచి సతీశ్ సికర్వార్
పోహ్రీ నుంచి హరివల్లభ్ శుక్లా
ముంగౌలీ నుంచి కన్హయ్య రామ్ లోధీ
సుర్ఖి నుంచి పారుల్ సాహు
మందట నుంచి ఉత్తమ్రాజ్ నారాయణ్ సింగ్
బద్నవార్ నుంచి అభిషేక్ సింగ్ టింకూ
సువసార నుంచి రాకెశ్ పాటిదర్