వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం “భీష్మ”. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా నితిన్, రష్మిక, వెంకీ మధ్య చోటు చేసుకున్న సరదా సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముందుగా “భీష్మ” సినిమా సెట్స్లో నితిన్, తను మాట్లాడుకుంటున్న ఫోటోను వెంకీ ట్వీట్ చేసి “నేను, నితిన్ మాట్లాడుకుంటుంటే.. వెనకాల రష్మిక ఏమి చేస్తుందో మాకు తెలియదు” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు రష్మిక వెంటనే స్పందించింది. “ఏయ్.. సెట్స్లో మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏమి చేస్తుంటారో చెప్పమంటారా? మీ ఫోటోలు బయటపెట్టమంటారా?” అని బెదిరించింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. “మేం ఎక్కడైనా సినిమాల గురించే మాట్లాడుకుంటాం” అని ట్వీట్ చేశాడు. దీనికి మళ్లీ రష్మిక స్పందిస్తూ.. “ఏయ్.. నితిన్ నువ్వు ఆగు. మీరు సింగిల్ అని అంటుంటారు కానీ.. కాదు. నీకు వెంకీ, వెంకీకి నువ్వు తోడుగా ఉంటారు. నిజమైన సింగిల్ నేను” అని రష్మిక ట్వీట్ చేసింది.
previous post