లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 19వ తేదీ వరకు ప్రదర్శించవద్దంటూ చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేసి సినిమాను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ మేరకు ఆర్వోలు, ఎస్పీలు, సబ్కలెక్టర్లు, ఆర్డీవో సహా 66 మంది తహసీల్దార్లకు ఆదేశాల నకళ్లను పంపారు. జిల్లాలోని థియేటర్లు అన్నీ ఈ ఆదేశాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రద్యుమ్న అందులో పేర్కొన్నారు.
హీరోయిన్ వయసుపై టీవీ నటుడి కామెంట్స్… ఆమె స్పందన ఇదీ