మాస్ మాహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్రాక్’. గతంలో రవితేజతో డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు గోపీచంద్ మలినేని. ‘క్రాక్’ సినిమా ఫస్ట్లుక్ ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ‘క్రాక్’ సినిమా షెడ్యూల్ ఫైనల్ దశలో ఉంది. చిత్రీకరణను స్టార్ట్ చేశారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం విడుదలకు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. కాగా ఈ సినిమా తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘క్రాక్’ సినిమా పూర్తయిన కొన్నిరోజులకే ఈ సినిమా సెట్స్పైకి వెళుతుందని టాక్. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే పేరు వినిపిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో రవితేజ పాటు ప్రాధాన్యమున్న మరో పాత్ర కూడా ఉంటుందట. ఈ పాత్రలో శ్రీవిష్ణు, సత్యదేవ్ లాంటి హీరోలను తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆలోచిస్తుందట చిత్ర యూనిట్. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని సమాచారం. ఇందులో రవితేజ మరోసారి డ్యూయల్ రోల్ పోషించబోతున్నారని టాక్.
previous post