telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సర్కారు వారి పాట : షూటింగ్ కు రెడీ అవుతున్న మహేష్

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. అక్టోబర్ లో “సర్కారు వారి పాట” షూటింగ్ ను ప్రారంభించేందుకు పరశురాం అండ్ టీం ప్లాన్ చేస్తోందని సమాచారం. మార్చి నాటికి సినిమా పూర్తిచేసి ఏప్రిల్ నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related posts