బెంగళూరులో హైదరాబాద్ కు చెందిన జి.రంజిత్ కుమార్ రెడ్డి అనే టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 26 ఏళ్ల రంజిత్ కుమార్ రెడ్డి ఐఐటీ పట్టా అందుకున్నాక బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రులు కూడా రంజిత్ తో పాటు బెంగళూరులో ఉంటున్నారు. ఓ శుభకార్యం కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ రాగా, రంజిత్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
రంజిత్ కుమార్ రెడ్డి స్వస్థలం ఉప్పల్ లోని గణేశ్ నగర్. ఇంటర్ వరకు హైదరాబాదులోనే చదివి ఆపై ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించి ఉన్నత విద్య అభ్యసించాడు. చేతికి అందివచ్చిన ఏకైక కుమారుని మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.